తూ.గో : రూ.36 లక్షల విలువ గల బంగారం చోరీకి గురైందని ఒక వ్యాపారి అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం – తుని బస్సులో ప్రయాణిస్తుండగా అతనివద్ద నున్న రూ.36 లక్షల విలువ గల బంగారాన్ని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.