ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధిపథంలో అనకాపల్లి రైల్వేస్టేషన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2017, 12:51 AM

విశాఖపట్నం,సూర్యప్రతినిధి : గ్రామీణ జిల్లా కేంద్రంగా పేరొందిన అనకాపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఒక పక్క పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ, మరోపక్క ప్రయా ణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ అందరి ప్రసంశలు అందుకుంటోంది. మూడుసార్లు సికిం ద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఉత్తమ స్టేషన్‌గా అవా ర్డులు కైవసం చేసుకుంది. రైల్వే వారోత్సవాలు పురస్కరించుకొని అనకాపల్లి రైల్వేస్టేషన్‌ ప్రత్యేకత


విజయవాడ డివిజన్‌ పరిధిలో 111 స్టేషన్‌లు ఉన్నాయి. అందులో 10 ఏగ్రేడ్‌ స్టేషన్‌లలో అనకాపల్లి స్టేషన్‌ ఒకటి. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న స్టేషన్‌ నేడు ఎటుచూసినా మెరుగైన సౌకర్యాలతో కనువిందు చేస్తోంది. రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాల కల్పనకు అధికారులు కృషి చేస్తున్నారు. రోజుకు రూ.నాలుగు నుంచి ఐదు లక్షల వరకు స్టేషన్‌కు టిక్కెట్ల అమ్మకం, రిజర్వేషన్‌ ద్వారా ఆదాయం వస్తుంది. గత రెండేళ్లలో స్టేషన్‌ ముఖచిత్రమే మారిపోయింది. రూ.కోట్లు ఖర్చుచేసి ప్రయాణ ికులకు సౌకర్యాలు కల్పించారు. ముందుగా మూడు ప్లాట్‌ఫాంలను ఆధునీకరించారు. రెండో నెంబరు ప్లాట్‌ఫాంపై రూ.88 లక్షలతో ఎస్కలేటర్‌ ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.1.50 లక్షలతో టిక్కెట్‌ వెండింగ్‌ మిషన్లు సమకూర్చారు. మోదీ స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో స్టేషన్‌ను అద్దంలా మార్చే శారు. స్టేషన్‌ సూపరింటెండెంట్‌ కొమ్ముశెట్టి పార్థసారథి పర్యవేక్షణలో 1, 2, 3 ప్లాట్‌ఫారాలపై వివిధ రకాల మొక్క లను నాటారు. అంతేకాకుండా ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందితో ప్రతిరోజూ పరిశు భ్రత పనులు చేపడుతూ స్టేషన్‌ను పరిశు భ్రతకు చిరునామాగా మార్చారు. చెత్తను సైతం ఎక్కడా వేయకుండా 42కి పైగా డస్‌‌టబిన్‌లు ఏర్పాటు చేశారు. ఎంపీ నిధులతో ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా పర్మినెంట్‌ కూర్చీలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొనివచ్చారు. రూ.లక్షలు వ్యయంతో శుద్ధ తాగునీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేసి తక్కువ ధరకు పరిశుభ్రమైన చల్లటి నీటిని అందిస్తున్నారు. ఇలా స్టేషన్‌ను అన్ని విభాగాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దడం వల్ల వరుసగా 2014, 2015, 2016లో రైల్వే వారోత్సవాలు సికింద్రబాద్‌ డివిజన్‌లో అనకాపల్లి రైల్వేస్టేషన్‌కి మూడుసార్లు ఉత్తమ రైల్వేస్టేషన్‌గా అవార్డు ఇచ్చారు. ఈ ఏడాదీ అవార్డు రేస్‌లో ఉంది. స్టేషన్‌ తనిఖీకి వచ్చిన విజయవాడ, సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఉన్నత అధికారులు స్టేషణ్‌లో సౌకర్యాలు, పరిశుభ్రతకు ముగ్ధులైపోతున్నారు. త్వరలో రూ.1.88లక్షలతో కాలిబాట వంతెన, రెండో నెంబరు ప్లాట్‌ఫాంపై రూ.90 లక్షలతో మరో ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నేడో రేపు గూడ్స్‌షెడ్డు వద్ద అదనపు బుకింగ్‌ కౌంటర్‌ ప్రారంభించి 


అందుబాటులోకి తీసుకొని రాను న్నారు.అనకాపల్లి రైల్వేస్టేషన్‌ నేడు అందరి సహకారంతోనే దినదినాభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మూడుసార్లు డివిజన్‌లో ఉత్తమ స్టేషన్‌గా అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు రైల్వే వారోత్సవాల్లో జీఎమ్‌ చేతుల మీదుగా అవార్డులు వచ్చాయి.


 గతంలోనూ పలుమార్లు డీఆర్‌ఎమ్‌ అవార్డులు వచ్చాయి.  ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి సికింద్రాబాద్‌లో జరగబోయే రైల్వే వారోత్సవాల్లో మరోసారి అవార్డు వరించనున్నదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. స్టేషన్‌ అభివృద్ధిలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు సహకారంతోపాటు విజయవాడ డివిజన్‌ డీఆర్‌ఎమ్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ జీఎమ్‌ అధికారులు కృషి ఉంది. మరింతగా అభివృధ్ధి చేసి రైల్వేలోని అన్ని డివిజన్‌లలో అనకాపల్లి స్టేషన్‌ను ఉత్తమంగా తీర్చుదిద్దుతాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com