హైదరాబాద్ : తాను సేవా పన్ను ఎగవేయలేదని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సమాధానమిచ్చారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా రాష్ట్ర ప్రభుత్వం సానియామీర్జాకు ఇచ్చిన కోటిరూపాయలపై సేవా పన్ను చెల్లించలేదని సర్వీసు ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన సమన్లకు సానియా మీర్జా తన చార్టర్డ్ అకౌంటెంటు ద్వారా సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తనకు శిక్షణ ప్రోత్సాహకంగానే కోటిరూపాయలు ఇచ్చిందని సానియా సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. సానియాకు బ్రాండ్అంబాసిడర్ గా డబ్బు ఇవ్వలేదని చార్టర్డ్ అకౌంటెంటు చెప్పారు. సర్వీసు ట్యాక్స్ అధికారులు మాత్రం తెలంగాణ సర్కారు ఇచ్చిన కోటి రూపాయలపై సేవా పన్ను కింద 14.5 శాతం డబ్బు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. కాగా తెలంగాణ ప్రభుత్వం 2014 జులైలో సానియాను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడరుగా ప్రకటించి ప్రధాన టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు వీలుగా శిక్షణ కోసం కోటి రూపాయలు ఇచ్చిందని చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీసుట్యాక్స్ అధికారులకు సమర్పించిన సమాధానంలో వివరించారు.