శపథం చేసిన పన్నీర్ సెల్వం
-ఢిల్లీకి బయలుదేరనున్న పన్నీర్ సెల్వం వర్గం
-పార్టీని శశికళ కుటుంబం చేతుల్లోకి వెళ్లనివ్వం: పన్నీర్ సెల్వం
చెనై్న : తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించిన నేప థ్యంలో పన్నీర్ సెల్వం గురువారం మధ్యాహ్నం తన మద్దతుదారులతో కలసి మీడియా ముందుకు వచ్చారు. తమ వర్గానికి ప్రతికూలంగా గవర్నర్ ప్రక టన వచ్చినప్పటికీ తాము ధర్మ యుద్ధాన్ని కొనసాగి స్తామని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. మళ్లీ రాష్ట్రం లో అమ్మ జయలలిత పాలనను తీసుకువచ్చేలా పని చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు ఓ కుట్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్నా డీఎంకే పార్టీ ఓ నియంత చేతిలో ఉందని అన్నారు. వారి కుట్రలను సాగనివ్వబోమని చెప్పారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించడంతో కంగు తిన్న పన్నీర్ సెల్వం వర్గం ఢిల్లీకి పయనం కావాలని నిర్ణయించుకుంది. చెనై్న నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకొని ఎన్నికల కమిషన్తో భేటీ అవుతామని ఆయన వర్గ నేతలు ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ముందు తమ అభ్యంతరాలను తెలపనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పన్నీర్ వర్గం ఈసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించిన అంశంపై పన్నీర్ సెల్వం స్పందించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాము తమ అన్నా డీఎంకే పార్టీని శశికళ నటరాజన్ కుటుంబం చేతుల్లోకి వెళ్లనివ్వబోమని చెప్పారు. మొదట తాము ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు.
పార్టీ నేతలు ఐక్యంగా ముందుకు వెళ్లేట్లు ప్రయత్నాలు జరుపుతామని చెప్పారు. శశికళకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతోందని చెప్పారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోనని జయలలితకు చెప్పిన శశికళ ఇప్పుడు సీఎం కావాలని కలలు కన్నారని పన్నీర్ సెల్వం చెప్పారు. తాము అమ్మ జయలలిత ఆశయాలను ముందుకు తీసుకువెళతామని చెప్పారు.