AP: తిరుపతిలో గురువారం నాడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా SPDCL కార్యాలయంలో 18 మందికి కారుణ్య నియామకపత్రాలను అందజేశారు. ఇప్పటివరకు విద్యుత్ శాఖలో 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టామని, విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని ఆయన తెలిపారు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి ప్రజలపై భారం మోపిన YCPకి విద్యుత్ శాఖపై మాట్లాడే హక్కు లేదని మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa