ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) 76వ పుట్టినరోజు సందర్భంగా అమరావతి శంకుస్థాపన స్థలం ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. వేదం, రుద్రం పఠనాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న ఈ కార్యక్రమంలో తొమ్మిది మంది పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నీరు-మట్టి ప్రదేశంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 76 కదంబ మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం నుంచి తెచ్చిన కదంబ విత్తనాలతో ఈ మొక్కలను పెంచారు. కదంబ వృక్షానికి పార్వతి దేవి ఆశీస్సులు ఉన్నాయని, లలిత సహస్రనామంలో దీని ప్రాధాన్యం ప్రస్తావించబడిందని ప్రజల విశ్వాసం. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa