కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం చిలకలదోన వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 12 మంది చనిపోయారు. కర్ణాటక రాష్ట్రం చికమగులూరు ప్రాంతానికి చెందిన యాత్రికులు బొలెరో వాహనంలో మంత్రాలయం వస్తుండగా ఈ దారుణం జరిగింది ఒక సిమెంట్ ట్యాంకర్ బొలెరోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వాహనంలో 21 మంది వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా, నలుగురు హాస్పిటల్లో మరణించారు. మిగిలిన వారు కర్నూల్, ఎమ్మగనూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వేకువనే మూడున్నరకు ఈ దారుణం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa