ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర రెడ్డికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2026, 02:00 PM

ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల గర్వకారణంగా, ప్రజల మధ్య ఉంటూ సేవలందిస్తున్న ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర రెడ్డిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నాయకత్వంపై నమ్మకంతో ముందుకు సాగుతున్న ఆయన కృషికి ఈ నియామకం నిదర్శనం. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, అభివృద్ధి దిశగా కృషి చేస్తున్న ఆయనకు ఈ పదవి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ సందర్భంగా గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa