ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్పొరేట‌ర్ మువ్వల లక్ష్మి సురేష్‌కు ఘన సన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2026, 04:00 PM

విశాఖలోని జీవీఎంసీ 20వ వార్డు కార్పొరేటర్ మువ్వల లక్ష్మి సురేష్ తన ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పెదవాల్తేరు ప్రజలు గురువారం ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని, వార్డు అభివృద్ధిలో లక్ష్మి సురేష్ కనబరిచిన చొరవను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa