ఇండియన్ ప్రీమియర్ లీగ్–2026 సీజన్ ప్రారంభానికి ఇక కొద్దిరోజులే మిగిలి ఉన్నాయి. గత సీజన్లో అద్భుత ప్రదర్శనతో తొలిసారి టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి డిఫెండింగ్ చాంపియన్గా మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.మొదటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడేందుకు జట్టు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా, ఎన్నో సంవత్సరాలుగా ఆర్సిబి తరఫున ఆడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఆల్టైమ్ ఫేవరెట్ ఆర్సిబి ప్లేయింగ్ ఎలెవన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆర్సిబి విడుదల చేసిన వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ, తాను ఓపెనర్గా క్రిస్ గేల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. మ్యాచ్ మొదటి నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసి వేగంగా పరుగులు సాధించాలని తన ఉద్దేశమని చెప్పాడు. విదేశీ ఆటగాళ్లుగా క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్తో పాటు మిచెల్ స్టార్క్ను జట్టులోకి తీసుకుంటానని వెల్లడించాడు.నాలుగో విదేశీ ఆటగాడిగా డేల్ స్టెయిన్ను ఎంపిక చేస్తానని, అతని వేగవంతమైన బౌలింగ్ జట్టుకు బలాన్ని ఇస్తుందని కోహ్లీ పేర్కొన్నాడు. బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా ఉండేందుకు ఈ ఇద్దరు సీమర్లకు అవకాశం ఇస్తానని వివరించాడు.మిడిల్ ఆర్డర్లో నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ను ఆడిస్తానని కోహ్లీ చెప్పాడు. ఆర్సిబి తరఫున అతను గతంలో కీలక ఇన్నింగ్స్లు ఆడిన అనుభవం ఉందని తెలిపాడు. ఐదో స్థానంలో రజత్ పాటిదార్ను బ్యాటింగ్కు పంపుతానని, స్పిన్ బౌలింగ్ను అతను చక్కగా ఎదుర్కోగలడని చెప్పాడు.ఆరో స్థానంలో ఫినిషర్గా దినేశ్ కార్తీక్ను ఎంపిక చేస్తానని పేర్కొన్నాడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో యుజ్వేంద్ర చాహల్, అనిల్ కుంబ్లేలను జట్టులోకి తీసుకుంటానని తెలిపాడు. అలాగే మూడో పేసర్గా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న హర్షల్ పటేల్కు కూడా అవకాశం ఇస్తానని కోహ్లీ వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa