అచ్చంపేట, మేజర్న్యూస్: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట రెవెన్యూ డివిజన్ పరిదిలోని అచ్చంపేట మండలం లింగోటం గ్రామ సమీపంలోని ఆదివారం చెరువులో పడి ఇద్దరు బాలికలు దుర్మరణం చెందిన ఘటన అచ్చంపేట పోలీసులు,కుటంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నల్గోండ జిల్లా సూర్యపేటకు చెందిన పంపంగి యాదగిరి-ఇందిరమ్మ,అదే జిల్లాలోని మునుగోడుకు చెందిన రాపోలు దుర్గయ్య-చిగురమ్మ దంపతులు బ్రతుకుదెరువుకోసం గత రెండు ఏండ్లక్రితం బడ్డకోట్టుకుని జీవనం సాగిస్తుంన్నారు.వారిపిల్లలు అయిన నందిని (12),స్వాతి(7)లు వారి తల్లులు బట్టలను ఉతుకుటకు చెరువుకు వెళ్లారు.వారు బట్టలను ఉతుకుతుండగా ప్రక్కనే నీళ్లలో ఆడుకుంటున్న ఇద్దరు ,చిన్నారులు చెరువులోకి జారుకుపోవడంతో వారికి ఈత రాకపోవడంతో వారు నీటిలో మునిగి అక్కడికి అక్కడే మృతి చెందారు.అది గమనించిన వారి తల్లులు కుటంబసభ్యుల కు,గ్రామస్ధులకు ఈ విషయం చెప్పడంలో అందరు కలిసి చెరువులో గాలించగా ఇద్దరు బాలికల శవాలను బయలకు తీశారు.బాలిక శవాల వద్ద వారికుటంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.తమ పిల్లల బ్రతుకుదెరువుకోసం అచ్చంపేట మండల పరిదిలోని లింగోటం సమీపంలొని రాతి బండపై పనులు చేయుటకు గత రెండు ఏండ్లక్రితం ఇక్కడకు వచ్చినట్లు వారు తెలిపారు.పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు శవాలను కుటంబ సభ్యులకు అందజేశారు.ఈ మేరకు అచ్చంపేట పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.