గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో భర్తను హత్య చేసిన భార్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. జనవరి18న శివనాగరాజు అనే వ్యక్తిని అతని భార్య లక్ష్మీమాధురి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యలో లక్ష్మీ మాధురి, గోపీలతోపాటు ఓ ఆర్ఎంపీ డాక్టర్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తు్న్నారు. గోపీకి స్నేహితుడైన ఆ ఆర్ఎంపీ డాక్టరే వీరికి నిద్రమాత్రలు ఇచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే శివనాగరాజు హత్య జరిగినప్పుడు ఈ ఆర్ఎంపీ డాక్టర్.. చిలువూరు వచ్చి నిందితులకు సహకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు వీరిని విచారిస్తు్న్నట్లు తెలిసింది.
మరోవైపు భార్యాభర్తలైన శివనాగరాజు, లక్ష్మీమాధురి మధ్య గతం నుంచే గొడవలు ఉన్నట్లు తెలిసింది. భర్తకు ఉన్న అరెకరం పొలాన్ని కూడా లక్ష్మీమాధురి ముందే తన పేరిట రాయించుకున్నట్లు సమాచారం. పొలం రాయించుకున్న తర్వాత శివనాగరాజుపై ఆరోపణలు చేస్తూ సొంతూరితో పాటుగా, దుగ్గిరాలలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. భర్తను ఉల్లిపాయల వ్యాపారం మానేసి.. గోపీ తరహాలో ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకోవాలని పట్టుబట్టినట్లు తెలిసింది. మిగిలిన ఆస్తిని కూడా అమ్మేసి ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలంటూ భర్తపై లక్ష్మీమాధురి ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
దీంతో శివనాగరాజు ముందు జాగ్రత్తగా ఇంటి దస్తావేజులు, తన పేరుతో ఉన్న ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు అన్నీ తన స్నేహితుడి వద్ద ఉంచి, అడిగినప్పుడు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది.శివనాగరాజు హత్య జరిగిన తర్వాత.. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితుడు.. ఈ డాక్యుమెంట్లను శివనాగరాజు కుటుంబ సభ్యులకు అందించారు. పోలీసులకు ఈ విషయాన్ని తెలిపారు.
చిలువూరుకు చెందిన శివనాగరాజుకు 2007లో లక్ష్మీమాధురితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే భర్త ఉల్లిపాయల వ్యాపారం చేయడాన్ని నామోషీగా భావించేది లక్ష్మీమాధురి. విజయవాడలోని సినిమా థియేటర్లో పనిచేసే సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో లక్ష్మీమాధురికి పరిచయమైంది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత భర్తతో ఉల్లిపాయల వ్యాపారం ఆపివేయించిన లక్ష్మీమాధురి..హైదరాబాద్లోని గోపీకి చెందిన కారు ట్రావెల్స్లో ఉద్యోగానికి పంపింది. కొంతకాలం తర్వాత శివనాగరాజు సొంతూరికి వచ్చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అలాగే శివనాగరాజు ఇంటి వద్ద నుంచే బిజినెస్ చేస్తూ ఉండటంతో గోపీని కలవడానికి వీలులేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న లక్ష్మీ మాధురి.. జనవరి 18వ తేదీన భర్తకు బిర్యానీలో 20 నిద్రమాత్రలు కలిపి పెట్టింది. బిర్యానీ తిన్న శివనాగరాజు నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత రాత్రి 11.30 సమయంలో నిద్రపోతున్న భర్తను గోపీ సాయంతో హత్యచేసింది మాధురి. దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత గోపీ అక్కడి నుంచి వెళ్లిపోగా. లక్ష్మీమాధురి తెల్లవారేవరకూ రాత్రి మొత్తం పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండెనొప్పితో తన భర్త చనిపోయాడంటూ డ్రామా చేసింది. అయితే శివనాగరాజు స్నేహితులు.. శివనాగరాజు చెవిలో రక్తం, ఇతర గాయాలు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు యవ్వారం వెలుగుచూసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa