ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 10:29 AM

రాష్ట్రంలో గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎంతో ఉపయోగపడిన ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రస్తుత కూటమి సర్కార్‌ నిర్వీర్యం చేసిందని, చివరకు రైతులు నేరుగా ప్రీమియం కట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం. రైతు సంక్షేమం) ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చినా, జాతీయ స్ధాయిలో చూసినా వరి దిగుబడులు భారీగా పడిపోతున్నాయని, ఇలాంటి కష్ట సమయంలో రైతులకు మేలు చేసే ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో రికార్డు స్దాయిలో 41 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెబుతున్నారు. కానీ అది తప్పు. జగన్‌గారి హయాంలోనే 2019–20 ఖరీఫ్‌లో 47.85 లక్షల టన్నులు, 2020–21 ఖరీఫ్‌లో 44.46 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. అలాంటప్పుడు ఇప్పుడు 41 లక్షల టన్నులకే రికార్డు అని ఎలా చెబుతారు?. ఇంకా 51 లక్షల టన్నులు సేకరిస్తామని ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చెబుతున్నారు. మొంథా తుపాన్‌ తర్వాత వరి దిగుబడులు తగ్గాయన్నది నిజం. కానీ ప్రభుత్వం మాత్రం బుకాయిస్తూ వచ్చింది. కేంద్రం నివేదికల ప్రకారం ఈసారి ఖరీఫ్‌ లో 52.9 లక్షల బియ్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. తెలంగాణలో 70.28 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. వరి సేకరణలో దేశంలో యూపీ, పంజాబ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ టాప్‌–5లో ఉంటే, ఏపీ 10వ స్ధానంలో ఉంది. అందుకే ఈసారి ఆశించిన స్ధాయిలో వరి ఉత్పత్తి కావడం లేదన్న జగన్‌ మాట నిజమైంది అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa