తిరుమల,సూర్యప్రతినిధి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సినీనటుడు రాజేంద్ర ప్రస్రాద్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆలయం ఎదుట రాజేంద్ర ప్రసాద్ మీడి యాతో మాట్లాడుతూ సీనీరంగం లో 40వ ఏట అడుగుపెట్టానని వెల్లడించారు. శ్రీవారి దర్శనం తనకు పరమానందాన్ని కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. తిరుమలకు ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావద్దని, నీటిని వృథా చేయొద్దని భక్తకోటికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.