వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (దావోస్) 2026 సదస్సుకు ఆంధ్రప్రదేశ్ సర్వసన్నద్ధమైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యమని, సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతను కొనియాడారు. దావోస్ వ్యాపార, సాంకేతిక పోకడలను అర్థం చేసుకునే గొప్ప వేదిక అని, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో దీర్ఘకాలిక సంబంధాలకు దోహదపడుతుందని వివరించారు. బ్రాండ్ ఏపీని అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరించి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉపాధి కల్పించడమే అంతిమ ధ్యేయమని లోకేశ్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa