వినూత్న ఘట్టం: భారత అంతరిక్ష సంస్థ (ISRO) ఇటీవల ఒక అద్భుతం సృష్టించింది. ISRO ప్రయత్నించిన పీఎస్ఎల్వీ మిషన్ అనూహ్యంగా మూడో దశలో విఫలమయింది. దీని కారణంగా శాస్త్రవేత్తలు కొంతసేపు నిరాశలో మునిగిపోయారు.కానీ ఆశ్చర్యం! మరో శాటిలైట్ నుంచి కీలక డేటా రావడం ప్రారంభమైంది. అది కూడా ISRO లక్ష్యంగా పెట్టుకున్న సమాచారం కావడంతో, అందరికీ మళ్లీ ఊరట లభించింది. ఖగోళ పరిశోధనలో ఇది నిజంగా అద్భుతమైన ఘట్టంగా సూచించబడుతోంది.నిన్న ISRO పీఎస్ఎల్వీ C62 వాహక నౌక ద్వారా, డీఆర్డీవో EOS-N1 (అన్వేష) సహా 16–18 ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. మొదటి రెండు దశలు సాఫీగా జరిగాయి. అయితే మూడో దశలో చాంబర్ ప్రెజర్ డ్రాప్ ఏర్పడింది. దాంతో, పీఎస్ఎల్వీ నియంత్రణ కోల్పోయి, చివరికి కక్ష్యపథంలో చేరకుండానే విఫలమయింది. గతేడాది మేలోని C61 ప్రయోగం తర్వాత ఇది రెండవసారి అలాంటి సమస్య ఎదుర్కొంది.అయితే, ఈ విఫలమైన దశలో కూడా ఒక అద్భుతం వెలుగులోకి వచ్చింది. స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ ప్యారడైమ్ ప్రయోగించిన KID (Castral Initial Demonstrator) క్యాప్సూల్ కఠిన పరిస్థితుల మధ్య బాగుగా బయటపడింది. ఇది భూమికి తిరిగి కీలక డేటాను ప్రసారం చేయడం ప్రారంభించింది. పూర్తి నివేదికలు ఇంకా రాలేకపోయినప్పటికీ, ఈ విజయం ప్రైవేట్ అంతరిక్ష వెంచర్ల కోసం ఒక కీలక మైలురాయిగా భావించబడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa