సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రవాణా శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది.జనవరి 7 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను ప్రారంభించిన అధికారులు, ఇప్పటి వరకు సుమారు 75 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ప్రయాణికుల వివరాల జాబితాను నిర్వహించకపోవడం, కనీస ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు లేకపోవడం, ఎక్కువ సరుకు రవాణా చేయడం వంటి ఉల్లంఘనలు ఈ చర్యలకు కారణమని రవాణా శాఖ పేర్కొంది. పండుగ సీజన్ ముగిసేవరకు, ప్రైవేట్ బస్సుల కోసం ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచి, రవాణా శాఖ 8 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని అన్ని రవాణా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, ఎక్కడా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు.ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు అనధికారికంగా అధిక ఛార్జీలు వసూలు చేయకుండా కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తీసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ నిర్ణయించిన పరిమితిని మించిపోయి టికెట్ ధరలు వసూలు చేస్తే, కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే లైసెన్స్ రద్దు చేయవచ్చని స్పష్టంగా హెచ్చరించారు.మరింతగా, స్లీపర్ బస్సుల భద్రత, నిర్వహణ కోసం కొత్త మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకుని తెలంగాణలో రాకపోకలు చేసే స్లీపర్ బస్సుల బాడీ బిల్డింగ్, సాంకేతిక ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేసిన, ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.పండుగ వేళ ప్రజల ప్రయాణం సురక్షితంగా, సులభంగా సాగేలా చూసుకోవడమే, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల దోపిడీని అడ్డుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం అని రవాణా శాఖ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa