ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రరాష్ట్రం ఈ 18 నెలల కాలంలో అప్పులాంధ్రప్రదేశ్ గా మిగిలిపోతోందని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 18 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పు చేసిందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన రుణంలో, దాదాపు 80 శాతం కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే అప్పుడు రెండేళ్లు కోవిడ్ సంక్షోభం ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం అప్పు చేసినా, ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని, కార్యక్రమాన్ని ఆపలేదని, దాదాపు రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ రూపంలో వివిధ పథకాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. ఇప్పుడు ఇంతింతగా అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఆ మొత్తం ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పమంటే నోరు మెదపడం లేదని, విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa