శ్రీశైలం మహాక్షేత్రంలో శివభక్తుల సందడి పీరింది. కార్తీక మాసంలో శివమాల ధరించిన భక్తులు ఇప్పుడు శ్రీమల్లికార్జున స్వామికి ఇరుముడి సమర్పణ కోసం మల్లన్న ఆలయానికి తరలుతున్నారు.ఈ నేపథ్యంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఇరుముడి సమర్పణతో వచ్చే శివభక్తులకు ప్రత్యేకంగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించనున్నారు. ఆలయ అధికారులు ఈ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు స్పర్శ దర్శనం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇప్పటికే సాధారణ భక్తుల స్పర్శ దర్శనాలు రద్దు చేయగా, వారికి ఆలయ అలంకార దర్శనం చూడటానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. భక్తుల రద్దీ పెరగడం వలన మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇరుముడితో వచ్చిన భక్తులు రెండు గంటలకు ఒకసారి స్పర్శ దర్శనం పొందుతున్నారు. మిగిలిన సమయాల్లో సాధారణ భక్తులు ఆలయ అలంకార దర్శనం ఆస్వాదించగలరు.అలాగే, వేచిఉండే భక్తుల కోసం ఆలయ అధికారులు అల్పాహారం, మంచినీరు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు అని ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa