తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,578 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,630 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం నిన్న రూ.2 కోట్లుగా ఉంది.