భారతీయ రైల్వేలో భారీ నియామకాలు జరుగుతున్నాయి. మొత్తం 5,810 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఇది బంపర్ అవకాశం. ఎందుకంటే సికింద్రాబాద్ జోన్లోనే 396 పోస్టులు కేటాయించారు.
అర్హతలు చాలా సరళంగా ఉన్నాయి – ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 33 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీలకు (SC, ST, OBC, EWS) నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది. మహిళలు, ఎక్స్-సర్వీస్మెన్, PwBD అభ్యర్థులకు కూడా ప్రత్యేక సడలింపులు అందుబాటులో ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-1 & CBT-2), టైపింగ్ స్కిల్ టెస్ట్ లేదా ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ దశలు ఉంటాయి. పోస్టుకు అనుగుణంగా స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ వంటి హంగులు లభిస్తాయి.
దరఖాస్తు ఫీజు జనరల్/OBC అభ్యర్థులకు రూ.500 కాగా, SC/ST/PwBD/మహిళలు/ఎక్స్-సర్వీస్మెన్/ఈబీసీ అభ్యర్థులకు కేవలం రూ.250 మాత్రమే. ముఖ్యంగా రేపు (నవంబర్ 26, 2025) రాత్రి 11:59 గంటలకు ఆన్లైన్ అప్లికేషన్ మూసివేయబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa