ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌లోని మొంథా తుపాను ప్రభావం నుంచి కోలుకోకముందే కొత్త అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 07:01 AM

మొంథా’ తుపాను ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని, ఆ సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని స్పష్టంగా హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa