రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన 175 అసెంబ్లీ తో పాటుగా ఇప్పుడు మరో 50 అసెంబ్లీ స్థానాలు అదనంగా రానున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా పెరగనున్న అసెంబ్లీ సీట్ల వివరాలు మీ కోసం:అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. కడప జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడున్న 19 అసెంబ్లీ సీట్లకు మరో 6 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పుడున్న 17 అసెంబ్లీ సీట్లకు మరో 5 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. కృష్ణా జిల్లాలో ఇప్పుడున్న 16 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. కర్నూల్ జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. నెల్లూరు-జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. ప్రకాశం-జిల్లాలో ఇప్పుడున్న 12 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. విజయనగరంజిల్లాలో ఇప్పుడున్న 9 అసెంబ్లీ సీట్లకు మరో 2 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. విశాకపట్టణంజిల్లాలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ సీట్లకు మరో 5 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.అయితే దీని పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పెరిగిన అసెంబ్లీ సీట్ల పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన వెలువడే దాకా ఆగాల్సి ఉంది.