చేజర్ల మండలం బోడిపాడు, పాడేరు గ్రామాల్లో నిర్మితమవుతున్న 70 మెగావాట్ల సౌర విద్యుత్తు పార్కు (ఉత్పాదన కేంద్రం) పనులు చురుగ్గా సాగుతున్నాయి. సన్ ఎడిషన్ సంస్థ 2016లో చేజర్ల మండలంలో 350 ఎకరాల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి పార్కు నిర్మాణ పనులు చేపట్టింది. ఆ సంస్థ నిధుల కొరత కారణంగా దీన్ని నిలపగా గ్రీన్కే సంస్థ స్వీకరించింది. వచ్చే జులై నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టారు. విద్యుత్తు కేంద్రానికి భారీగా సౌర ఫలకాలు, నిర్మాణ సామగ్రిని సిద్ధం చేశారు. నేల చదును, ప్రాకారం నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో ఒడిశా, బిహార్, తమిళనాడు కార్మికులతో పాటు స్థానికులకు పని లభిస్తోంది. నిర్మాణం పూర్తయితే ఆదూరుపల్లిలోని 132 కేవీ విద్యుత్తు ఉపకేంద్రానికి ఈ సౌర విద్యుత్తు కేంద్రాన్ని అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉత్పత్తి అవుతోన్న తాప విద్యుత్తుకు సౌర విద్యుత్తు అదనంగా సమకూరనుంది. ఈ సౌర విద్యుత్తు పార్కు నిర్మాణం పూర్తయితే 50 మందికి పైగా యంత్ర, సాంకేతిక నిపణులు, భద్రత విభాగాల్లో ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి.