ధర్మశాల: ధర్మశాలలో ఆసీస్పై ఘనవిజయం సాధించి, సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ బోర్డర్-గావస్కర్ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. ట్రోఫీని కోహ్లీ, రహానె సంయుక్తంగా అందుకున్నారు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మూడు టెస్టులకు భారత్ బృందానికి విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాడు. మూడో టెస్టు తొలి రోజు ఆటలో కోహ్లీ కుడి భుజానికి గాయమవ్వడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో కోహ్లీ స్థానంలో రహానె కెప్టెన్గా వ్యవహరించాడు. నిర్ణయాత్మక చివరి టెస్టులో భారత సేనకు రహానె పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలను అందుకున్నాడు. మూడో టెస్టును డ్రాగా ముగించిన భారత సేన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని దక్కించుకుంది. ఈ క్రమంలో సిరీస్లో కెప్టెన్లగా వ్యవహరించిన కోహ్లీ, రహానె సంయుక్తంగా కలిసి సునీల్ గావస్కర్ చేతుల మీదుగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీని అందుకున్నారు. అనంతరం సిరీస్లో చివరి టెస్టులో కోహ్లీ స్థానంలో అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్న కుల్దీప్ యాదవ్ ట్రోఫీని అందుకుని సహచరులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు.