హైదరాబాద్ : ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్క్ హయత్ హోటల్లో కర్టెన్రైజర్ ఈవెంట్ నిర్వహించారు. కర్టెన్ రైజర్ ఈవెంట్లో టాలీవుడ్ తారలు నాని, రానా, రాయ్లక్ష్మీ, ప్రగ్యాజైశ్వాల్, అక్షరహాసన్, శాన్వి, రితికాసింగ్ సందడి చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఐఫాను ఓ కాలేజీ ఫంక్షన్లా నిర్వహించనున్నట్లు తెలిపాడు. తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం ఆనందంగా ఉందన్నాడు నాని. కర్టెన్ రైజర్లో తారలంతా సెల్ఫీ దిగి సందడి చేశారు. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డులను ఐఫాలో ప్రదానం చేయనున్నారు.