ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేకపోతే బాబు రాజీనామా చేస్తారా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 01:54 AM

 రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబు వైఖరి  ఎక్కడ ఏం జరిగినా నాేక ఆపాదిస్తారా?  దారుణమైన అబద్ధాలు చెబుతున్న తెలుగుదేశం  చెవిరెడ్డిని అక్రమంగా నిర్బంధించారు  మీడియాతో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌


విజయవాడ, మేజర్‌న్యూస్‌ : ఆరెంజ్‌ ట్రావెల్స్‌తో తనకు సంబంధం ఉందని నిరూపించకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఎక్కడ ఏం జరిగినా తనకు ముడిపెడితారా ఇంత దారుణంగా అబద్ధాలు చెబుతారా అని నిలదీశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా పడిన తర్వాత వై.ఎస్‌.జగన్‌ మీడియాతో మాట్లాడారు. సభ జరుగుతుండగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అక్రమంగా నిర్బంధించారని దీనిపై అడగడానికి ప్రయత్నిస్తే సభలో మైక్‌ ఇవ్వలేదని జగన్‌ ఆక్షేపించారు. రవాణా శాఖ కమీషనర్‌పై దాడికి సంబంధించిన అంశాన్ని అడిగితే ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేస్తారా అని ఆగ్రహంవ్యక్తం చేశారు. చట్టం తన పని తాను చేయకుండా సీఎం అడ్డుతగ లడం భావ్యమేనా అని వై.ఎస్‌.జగన్‌ నిలదీశారు. టీడీపీ నాయకులు రవాణా శాఖ కమీషనర్‌ గన్‌మెన్‌ను గట్టిగా తోసే శారని, వాళ్లకు క్షమాపణలు చెప్పారా అని ప్రశ్నించారు. ఒక ప్రైవేట్‌ వ్యవహారం కోసం టీడీపీ నేతలు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారని, ప్రజాహిత కోసం వెళ్లలేదని చెప్పారు. టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారని, ముఖ్యమంత్రి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com