కొంచెం ఇష్టం కొంచెం కష్టంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ కుమార్ పార్థసాని (డాలి) ఆ తర్వాత వెంకటేష్ పవన్ కళ్యాణ్ల కాంబోలో గోపాల గోపాల తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించి ప్రస్తుతం పవన్ తో కాటమరాయుడు ను రూపొందించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు కోసం..
సినిమా కలెక్షన్స్ ...
శుక్రవారం రోజు ఓపెనింగ్స్ చాలా గొప్పగా వచ్చాయ్. కానీ శనివారం మార్నింగ్ షో కాస్త తగ్గినట్టు అనిపించాయ్. నెలాఖరు కావడం, ఇంకా టెన్త్ ఎగ్జామ్స్ పూర్తికాకపోవడం అందుకు కారణం. మళ్ళీ ఆదివారం రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి.
ఈ సినిమాకి మీరెలా వచ్చారు ....
గోపాల గోపాల చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అనుకున్నాను. అయన కూడా ఒప్పుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకోమన్నారు. అలా నేను ఈ ప్రాజెక్టులోకి రావడం జరిగింది. వీరమ్ సినిమాలో ప్రేమని ఎలివేట్ చేసే ఒక మంచి పాయింట్ ఉందని అనిపించింది. అందుకే ఆ సినిమా చేద్దామని ఆయనకు చెప్పగానే ఓకే అన్నారు. తమిళంలో సెకండాఫ్లో లవ్ ట్రాక్ ఉంటే తెలుగులో మాత్రం ఫస్టాఫ్లోనే లవ్ యాంగిల్ తీసుకొచ్చాను. కథను చిన్న చిన్న మార్పులు చేశాం. అవన్నీ ఆయనకు నచ్చాయి.
రీమేక్లే చేయాలనుకున్నారా...
నేను రీమేక్ ఎప్పుడూ మక్కికి మక్కీ తెసేయను. నా సినిమాలూ ఏది చూసిన అర్థమవుతుంది. ఎక్కడో ఒకదగ్గరనుంచి మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. నా దగ్గరకు ఒక రీమేక్ తీసుకొచ్చి మక్కికి మక్కీ తీసేయమంటే నేను చేయను. అందులో నుండి ఒక ఇన్స్పి రేషన్ రావాలి. అప్పుడే చేస్తాను.
సినిమాలో చేంజెస్...
ఇందులో బేసిక్ లైన్ బాగుంటుంది. అం దుకే అది తీసుకు న్నాను. ఆ ట్రైన్ ఫైట్ అన్నీ బాగా డిజైన్ చేశారు. అందుకే వాటిని అలానే ఉంచాను. కానీ ఫస్టాఫ్ మొత్తం మార్చేశాం. ఒరిజినల్ వెర్షన్ నుండి కేవలం ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకున్నాం.
సెకండాఫ్ వీక్ అంటున్నారు. ..
నేననుకోవడం సెకాండాఫ్లోనే కథ ఉంటుంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగానే ఉంటుంది. కథకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు సినిమా కాస్త ఆగుతుంది. కథలో ట్విస్ట్ కాస్త ఆలస్యంగానే రావాలి. అందుకే కథ రెండవ భాగంలో స్టార్ట్ అవుతుంది.