మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై బుధవారం ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఐఆర్ఎస్ అధికారి నేతృత్వంలో ఆరు మంది ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈనేపథ్యంలో ప్రొద్దుటూరులోని ఎంఆర్ కాలనీలో పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.