ఏలూరు: వేలాది మంది డిపాజిటర్లను మోసం చేసిన కేసులో అరెస్టయి ఏలూరు సబ్జైలులో ఉన్న అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేష నారాయణలు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు వీరిద్దరినీ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వీరిని విజయవాడకు తరలించే యోజనలో అధికారులు ఉన్నారు.