ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందికొట్కూరులో పవన్ ఎన్నికల ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2019, 01:11 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో జనసేనాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనసైనికులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమ కళాకారులను గౌరవించడానికి రాయలసీమ కల్చరల్ అకాడమీ ఏర్పాటు చేస్తామని అన్నారు. రాయలసీమ అభివృద్దిలో వెనుకబడిన ప్రాంతమన్నారు. సౌభాగ్య రాయలసీమ కింద రూ.50వేల కోట్ల నిధులు విడుదల చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com