ఒంగోలు, మేజర్న్యూస్:రాష్ర్టంలో ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. ఒంగోలులోని ఎం.ఎస్. ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన విద్యుత్శాఖ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని 9నెలల్లో రూపొందించిన ఏకైక వ్యక్తి అని మంత్రి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 125 అడుగుల డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కోసం రూ.95 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులకు ఉపాధి కోసం 180 కోట్ల రూపాయలతో ఆటోలు, తదితర వ్యాపార సంబంధమైన యూనిట్లు నెలకొల్పడం కోసం ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రిని విద్యుత్ శాఖ ఎస్.ఇ. విద్యుత్శాఖ యూనియల్ నాయకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ జూపూడి ప్రభాకర్రావు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, విద్యుత్శాఖ ఎస్ఇ భాస్కర్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి. రవి. విద్యుత్శాఖ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.