ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరప్రదేశ్ సీఎం బంపర్ ఆఫర్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 02:54 PM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన శైలి నిర్ణయాలతో ముందుకెళ్తోన్న యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన మార్కును చాటారు. కైలాస మానస సరోవర యాత్ర చేపట్టనున్న యాత్రికులకు ఇస్తోన్న ఆర్థిక సాయాన్ని రూ. 1 లక్షకు పెంచారు. ఇప్పటి వరకూ రూ. 50 వేలు మాత్రమే ఇస్తుండగా యోగి దాన్ని రెట్టింపు చేయడం గమనార్హం. యాత్రికుల సౌకర్యార్థం ఢిల్లీ సమీపంలో లేదా మరో రాష్ట్రంలో మానససరోవర్ భవన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుందని ఆయన హామీ ఇచ్చారు.ఇంతకు ముందు కైలస సరోవర యాత్రికులకు రూ. 25 వేలు మాత్రమే ఇచ్చేవారు. అఖిలేష్ ప్రభుత్వం దీన్ని రూ. 50 వేలకు పెంచగా ఇప్పుడు దాన్ని యోగి మరింతగా పెంచేశారు. పాస్‌పోర్ట్ కాపీని లేదా స్థిర నివాస సర్టిఫికెట్‌ను చూపించిన వారికి ఈ గ్రాంట్‌ను అందిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com