ధర్మశాల: ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రాహుల్ కుమ్మిన్స్ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అతని స్థానంలో రెహానె క్రీజులోకి వచ్చాడు. 42 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.