ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 17న మరోసారి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 01:13 PM

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ, ఏపీ మంత్రుల సమన్వయ కమిటీ ముగిసింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రులు హరీష్ రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలతో పాటు 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై మంత్రులు గవర్నర్‌తో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసిన సచివాలయం, అసెంబ్లీ భవనాలు అప్పగించాలని తెలంగాణ మంత్రులు గవర్నర్‌ను కోరారు. సమావేశం ముగిసిన అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 17న మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. ఆ సమావేశంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగుల విభజనతో పాటు విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై చర్చించామని పేర్కొన్నారు. సచివాలయం విషయం కూడా చర్చించడం జరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com