ధర్మశాల : భారత్ -ఆస్ట్రేలియాల మధ్య ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. రాహుల్ కు ఈ సిరీస్ లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. 99 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సర్ రాహుల్ 58 పరుగులతోనూ, పుజారా 29 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఈ హాఫ్ సెంచరీతో ఈ సిరీస్ లో రాహుల్ సాధించిన హాఫ్ సెంచరీల సంఖ్య 5 కు చేరింది. 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో మురళీ విజయ్ 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. భారత్ తరఫున ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రాహుల్ ఇప్పుడు మురళీ విజయ్ సరసన చేరాడు.