హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్తో తెలంగాణ, ఏపీ మంత్రుల కమిటీ సమావేశమైంది. రాజ్భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రులు హరీష్ రావు, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలతో పాటు 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజనపై మంత్రులు గవర్నర్తో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసి సచివాలయం, అసెంబ్లీ భవనాలు అప్పగించాలని తెలంగాణ మంత్రులు గవర్నర్ను కోరనున్నారు.