విజయవాడ: విజయవాడ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం వద్ద లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఆధ్వర్యంలో తెదేపా ప్రతినిధులు ధర్నాకు దిగారు. ఉత్తరాది రాష్ట్రాలకు 400 ప్రయివేటు బస్సులు తిరుగుతున్నాయని- అనధికారికంగా, అనుమతి లేకుండా బస్సులు తిప్పుతున్నా- రవాణా శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకపోవడాన్ని తప్పుపడుతూ TNTUC ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్న బస్సుల్లో ప్రమాదాలు జరిగిప్పుడు మృతులకు, క్షతగాత్రులకు ఎలాంటి సహాయం ఇవ్వడం లేదని ఆరోపించారు. వీటిపై వివరణ అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని TNTUC నేతలు- ఎంపీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ కేశినేని నాని- ఎమ్మెల్యే బొండా ఉమ, MLC బుద్దా వెంకన్న తదితరులు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు. DTC మీరాప్రసాద్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో అక్కడే బైఠాయించారు. తమకు సరైన సమాధానం ఇచ్చే వరకు కార్యాలయం నుంచి బయటకు వెళ్లబోమని స్పష్టం చేయడంతో రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.