ధర్మశాల :ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 300 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి రోజు ఆట చివరి ఓవర్ మూడో బంతికి భువనేశ్వర్ కుమార్ లయన్ ను పుజారా క్యాచ్ ద్వారా పెవిలియన్ కు పంపించడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సరిగ్గా 300 పరుగుల వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా స్కిప్పర్ సెంచరీ, వేడ్ హాఫ్ సెంచరీ చేశారు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ 4 వికెట్లు, జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ లు చెరో వికెట్ పడగొట్టగా, ఉమేష్ యాదవ్ కు రెండు వికెట్లు లభించాయి.