మీరట్ : మీరట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్ బి. చంద్రకళను స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్గా, తాగునీరు, పారిశుద్ధ్యం విభాగం డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2008 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారిణి చంద్రకళ 2014లో నాణ్యత లేని రోడ్డు నిర్మించినందుకు అధికారులపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సామాజిక మీడియాలో ఆమె పేరు ప్రాచుర్యం పొందింది. నిజాయితీ కలిగిన అధికారిణిగా పేరొందిన చంద్రకళకు కేంద్రం సముచిత స్థానమిచ్చిందని పలువురు పేర్కొన్నారు.