అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఉపాధి హామీ పథకంపై సభలో నిశితంగా చర్చ జరిగింది. సభలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పథకం సరిగ్గా అమలు కావట్లేదు. అందుకే రాష్ట్రప్రజలు కేరళకు వలస వెళుతున్నారు. అక్కడి ప్రభుత్వం మన తెలుగువారి బాధలు చూడలేక 25కేజీల బియ్యం ఇస్తున్న పరిస్థితిని సర్కార్కు జగన్ వివరించారు. వైఎస్ హయాంలో 97.5% లేబర్ కాంపోనేంట్ ఉన్నదని ఆయన తెలిపారు. అప్పట్లో గ్రామాల్లో ప్రజలకు న్యాయం జరిగిందన్నారు.ఉపాధి హామీకి సంబంధించిన నిధులను ఉపాధిని క్రియేట్ చేయడం కోసం వెచ్చిస్తే దానివల్ల వలసలు ఉండవ్.. భిక్షాటన కోసం అన్నదాత పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా పోతుందని జగన్ సభాముఖంగా తెలియజేశారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మేం చెప్పిందే కరెక్టు అనుకుంటున్న సర్కార్ తీరుకు నిరసన తెలుపుతూ వాకౌట్ చేస్తున్నామని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంతకముందు మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు సక్రమంగా జరుగుతున్నాయని చెప్పారు.