ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహనే భారత్‌ను విజయవంతంగా నడుపగలడు : స్మిత్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 02:14 AM

ధర్మశాల : నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు కోహ్లీ అందుబాటులో లేకపోయినా... అజింక్య రహానె టీమిండియాను అద్భుతంగా నడిపించగలడని ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. భారత వైస్‌ కెప్టెన్‌ రహానె మృదు స్వభావి అని స్మిత్‌ కితాబిచ్చాడు. విరాట్‌ నాయకత్వం లేకుంటే టీమిండియాపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న ప్రశ్నకు జవాబిచ్చాడు. ‘‘ఇబ్బందేమీ ఉండదు. వాళ్లు బాగా ఆడతారు. అజింక్య అద్భుతంగా జట్టును నడిపించగలడు.! కోహ్లీ లేనప్పుడు రాంచీలో అతడు జట్టును ధైర్యంగా ముందుకు నడిపించాడు. అజింక్యపై నమ్మకముంది అని అన్నాడు. రహానె మృదు స్వభావి అని స్మిత్‌ అన్నాడు. మైదానంలో, బయటా అంత సులభంగా భావోద్వేగానికి గురికాడని పేర్కొన్నాడు. మ్యాచ్‌ పరిస్థితిని చక్కగా అంచనా వేయగలడని చెప్పాడు. స్టాండప్‌ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌పై కూడా స్మిత్‌ ప్రశంసలు కురిపించాడు. వార్మప్‌ మ్యాచ్‌లో ద్విశతకం బాదిన శ్రేయాస్‌ దూకుడుగా ఆడాడన్నాడు. తమ ప్రధాన బౌలర్లను ఎదుర్కో కున్నా గొప్పగా ఆడగలడని అనిపిస్తోందని పేర్కొన్నాడు. సిరీస్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తున్న ఆసీస్‌ ఆటగాళ్లను స్మిత్‌ కొనియాడాడు. స్వదేశంలో టీమిండియాను ఎదుర్కోవడం ఎప్పటికీ కష్టమే అని పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com