ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేవైఎం చేపట్టిన ఛలో అసెంబ్లీ భగ్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 02:04 AM

 -ముట్టడికి యత్నించిన నేతలు, కార్యకర్తల అరెస్ట్‌


 -ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన బీజేపీ నేతలు


 -మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని స్పష్టం చేసిన నేతలు


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. శుక్రవారం11వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరు గుతున్నందున సభకు ఎలాంటి ఆటంకం కలగ కుండా ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మొహరింపజేసింది. ఆందోళన కారులను అసెంబ్లీ వైపు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా బలగాలను ఏర్పాటు చేసింది. దీంతో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 12శాతం రిజర్వేషన్‌లను నిరసిస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. మత పరమైన రిజర్వేషన్ల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల ప్రభాకర్‌, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా.. బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌లు అక్కడికి చేరుకోగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌ ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం వ్యతిరేకించి నప్ప టికీ టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏకపక్షంగా ముస్లిం లకు  రిజర్వేషన్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ప్రభాకర్‌ మండిపడ్డారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే తప్పనిసరిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com