ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభ సజావుగా జరగనివ్వండి : టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 01:59 AM

అమరావతి: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం వైసీపీకి తగదని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలన్నారు. సభా ప్రయోజనాలను కాపాడేలా సభ్యులు ప్రవర్తించాలని ఆయన తెలిపారు. అగ్రిగోల్‌‌డ అంశాన్ని తప్పుదారి పట్టించేందుకే సభలో వైసీపీ సభ్యులు ఓటుకు నోటు కేసు ప్రస్తావన తీసుకొచ్చారని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ ఆరోపించారు.  పక్క రాష్ట్రంలో కొట్టేసిన కేసును ఇక్కడ ప్రస్తావించడం ఏంటని ప్రశ్నించారు. వెఎస్‌ హయాంతో చార్మినార్‌ బ్యాంక్‌ మూతపడితే డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.2వేల కోట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై అనేక కేసులు వేసిన వెఎస్‌ కుటుంబం కోర్టుతో చీవాట్లు తిన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com