అమరావతి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ప్రభుత్వ యంత్రాంగంలో తెలుగు భాష అమలుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసు కుంటోందని, అధికార భాష చట్టం అమ లులో ఉందని సమాచార, పౌరసంబంధా లశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అసెం బ్లీలో చెప్పారు. తెలుగు భాషలో నివేదికలు తయారు చేయడానికి ప్రభుత్వ కార్యా లయాల్లోని అన్ని కంప్యూటర్లలో అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను నిక్షిప్తం చేయాలని, సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.