ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ జీవితంలో ప్రశాంతత లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 01:43 AM

అమరావతి,సూర్యప్రతినిధి: విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి జీవితంలో ప్రశాంతత లేకుండా పోయిందని రాష్ట్ర ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌ అడ్డగోలుగా సంపాదించారని, జగన్‌ అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఎంతో ఆత్రంతో బెంగళూరులో భారీ భవంతి కట్టుకున్నారని, కానీ జైలులో ఉన్నన్ని రోజులు కూడా భవంతిలో ఉండలేకపో యారని యనమల అన్నారు. అంతేగాక పెద్దనోట్ల రద్దుతో జగన్‌ దారుణంగా దెబ్బతిన్నట్లుగా ఉందని, దాచుకున్న నోట్లన్నీ చెల్లకుండా పోయాయన్న బాధ జగన్‌లో కనిపిస్తోందని, అందుకే జగన్‌ సైకోలా మారారని యనమల అన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి వల్ల రెండు రోజుల శాసనసభా సమయం వృదా అయిందని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొ న్నారు. అసెంబ్లీలో జగన్‌ తీరును ఖండిస్తూ తీర్మానాన్ని యనమల ప్రవేశపెట్టారు.  అగ్రిగోల్‌‌డ భూముల విషయంపై మంత్రి ప్రత్తిపాటిపై జగన్‌ నిరాధార ఆరోపణలు చేశారన్నారు. అయితే తనపై జగన్‌ చేసిన ఆరోపణల విషయంలో సభాసంఘం వేయాలని ప్రత్తిపాటి కోరారని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని విపక్షనేత డిమాండ్‌ చేశారని యనమల అన్నారు. దీనిపై జ్యుడిషియల్‌ విచారణకు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమ న్నా రని, అయితే విపక్ష నేత ఏ విచార ణకు సిద్ధపడకపోగా నిరాధార ఆరోప ణలు పదే పదే చేస్తున్నారని యనమల పేర్కొన్నారు. విపక్ష నేత వల్ల రెండు రోజుల సమయం వృథా అయిందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com