ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సవాల్‌ను స్వీకరిస్తారా? లేదా?: స్పీకర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 01:39 AM

అమరావతి సూర్య ప్రత్యేక ప్రతినిధి : అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన సవాల్‌ను అంగీకరిస్తారో? లేదో? చెప్పాలని ప్రతిపక్ష నేత జగన్‌ను స్పీకర్‌ అడిగారు. ఉదయం నుంచీ ఈ అంశంపైనే రాద్ధాంతం జరుగుతున్నా పట్టించుకోకపోవడం తగదని సూచించారు. జగన్‌ తన ఆరోపణలకు న్యాయ విచారణకు అంగీకరిస్తారా? లేదా క్షమాపణ చెబుతారో ? చెప్పాలని మంత్రి అచ్చె న్నాయుడు అన్నారు. జగన్‌కు ఆరోపణలు చేయడం..సవాల్‌ చేస్తే తోక ముడచడం అలవాటేనని మంత్రి యనమల రామక ష్ణూడు ఎద్దేవా చేశారు. మంత్రిపై చేసిన ఆరోపణలు నిరూపించే సత్తా ఉంటే సవాల్‌ను జగన్‌ స్వీకరించేవారని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం తీరుతో విలువ్కెన సభా సమయం వథా అవుతోందన్నారు. ఏపీ అసెం బ్లీ రేపటికి వాయిదా పడింది. అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ప్రత్తిపాటి పుల్లారావుపై ప్రతిపక్ష నేత జగన్‌ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ శాసనసభ తీర్మానం అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. అంతకుముందు దీన్ని ఆర్థికమంత్రి యనమల సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. శుక్రవారం సభంతా ఆద్యంతం ప్రత్తిపాటి పుల్లారావుపై ఆరోపణలతోనే సాగింది. ప్రత్తిపాటిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ సభ్యులు డిమాండ్గ చేశారు. దీన్ని పట్టించుకోకుండా జగన్‌ సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అధికార పార్టీ సభ్యులు జగన్‌ వ్యవహార శైలిని తూర్పారబట్టారు. యనమల, వెంకట్రావు, జ్యోతుల నెహ్రూ, ఆదినారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి తదిరతులు ఈ అంశంపై మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com