ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో భారీగా వైఎస్‌టిడి సెంటర్లు నిర్మాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 01:08 AM

 -రెండువేల కోట్లకు పైగా పెట్టుబడులు


 -2019 మార్చి 31 నాటికి 2 వందల వైఎస్‌టిడి సెంటర్లను


 -వై స్క్రీన్స్‌ పనితీరును పరిశీలించిన యుఎఫ్‌ఓ సంస్థ


  విజయవాడ, సూర్య బ్యూరో : మినీ థియేటర్లు నిర్మించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సష్టించింది వై స్క్రీన్స్‌ సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన వైఎస్‌టిడి (వై స్క్రీన్స్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్స్‌) మరో సంచలనం.  మినీ థియేటర్ల ద్వారా తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం తీసుకుని వచ్చే మార్గాన్ని చూపిం చింది. అదే విధంగా ఇటీవల కాలంలో వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజ మానుల మధ్య వచ్చిన వివాదానికి అతీతంగా ఈ మినీ థియేటర్లు పని చేశాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో ఈ థియేటర్లు నిర్మించాల్సిన అవసరం కూడా వచ్చింది. ఇప్పటికే వై స్క్రీన్స్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2019 మార్చి 31 నాటికి 2 వందల వైఎస్‌టిడి సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించారు. అంటే దాదాపు 400 స్క్రీన్స్‌తో పాటు వ్యాపార కూడళ్లు కూడా ఇందులో వస్తాయి. ఇలా వై స్క్రీన్స్‌ పనితీరును పరిశీలించిన యుఎఫ్‌ఓ సంస్థ వై స్క్రీన్స్‌తో ఎం.ఓ.యు. కుదుర్చుకోవటానికి ముందుకు వచ్చింది. రానున్న ఐదు సంవత్సరాల్లో దాదాపు 2150 కోట్ల రూపాయల పెట్టుబడులు యుఎఫ్‌ఓ బాగస్వామ్యంతో రానున్నాయి. రాష్ర్టంలో భారీ ఎత్తున వైఎస్‌టిడి సెంటర్లు నిర్మాణానికి శ్రీకారం జరగనుంది. ఈ రెండు సంస్థలు కలిసి వై స్క్రీన్స్‌ నోవా సినిమాజ్‌ అనే సరికొత్త బ్రాండ్గను పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిలో మంచి భూమిక పోషిస్తున్న యుఎఫ్‌ఓ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రంగ ప్రవేశం చేసింది. భారత్‌, నేపాల్లో యుఎఫ్‌ఓసంస్థ దాదాపు 5వేల కు పైగా స్క్రీన్స్‌ను నిర్వహిస్తుంది. ఇలాంటి ప్రాథాన్యత కలిగిన వై స్క్రీన్స్‌, యుఎఫ్‌ఓ సంస్థలు ఎం.ఓ.యు కుదర్చుకోవటం తెలుగు రాష్ట్రాలకు ఒక వరంగా భావించవచ్చు. రాష్ర్ట విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టటానికి, కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించటానికి, కొత్త వ్యాపారులు తయారు కావటానికి ఎంతో ఆస్కారం ఉందని వై స్క్రీన్స్‌ సీఎండీ యార్లగడ్డ రత్నకుమార్‌ అభిప్రాయపడ్డారు. యుఎఫ్‌ఓవంటి సంస్థలు తమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం శుభపరిణామమని రత్నకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇంతవరకూ 2022 నాటికి 800 వైఎస్‌టిడి సెంటర్లు, 1600 స్క్రీన్స్‌  ప్రారంభించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్కొక్క వైఎస్‌టిడి సెంటర్లో దాదాపు 60 మంది వరకూ స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి కల్పించే దిశగా సంస్థ అడుగులు వేస్తుందన్నారు. ఇంతవరకూ కొవ్వూరు, కాకినాడ, రాజమండ్రి, రాజమండ్రి వద్ద దివాన్‌ చెరవు, రాజానగరం, ఆలమూరు, పిఠాపురం, గుడ్లవల్లేరు, నరసరావుపేట, నూజివీడు, జగ్గయ్యపేట, మైలవరం, భట్టిప్రోలు, పుత్తూరు వంటి ప్రాంతాల్లో వైఎస్‌టిడి సెంటర్లు నిర్మించేందుకు అవగాహన కుదురిందన్నారు. ఈ  కార్యక్రమంలో యుఎఫ్‌ఓ స్పెషల్‌ ప్రాజెక్ట్‌ సీఈవో విష్ణూ పటేల్‌, ఎపి అండ్‌ తెలంగాణా రాష్ట్రాల జి.ఎం. లక్ష్మణ్‌లు తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com