తిరుపతి, మేజర్న్యూస్ : తిరుపతి లోని టిటిడి అనుబంధ ఆలయాలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ఉదయం దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన తిరు పతి లోని శ్రీకోదండ రామ స్వామి వారి ఆలయం, శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగా పురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను సందర్శిం చారు. ఆయా ఆలయాల అధికారులు, అర్చకులు గవర్నర్కు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీమతి మునిలక్ష్మీ, శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ వెంకటయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.