ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్చూరులో విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 12:55 AM

 -అమెరికాలో తల్లీ, కొడుకు దారుణ హత్య


 -దుండగులు హత్య చేశారని పోలీసులకు  భర్త ఫిర్యాదు


 -అల్లుడే హంతకుడని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ


 -మృతులది పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెం


  ఒంగోలు, సూర్యప్రతినిధి  అమెరికాలో ఇద్దరు తెలుగు వారు దారుణ హత్యకు గురయ్యారు. న్యూజెర్సీలో మ్యాపుల్‌సెట్‌లో తల్లీ, కుమారుడిని దుండ గులు గొంత కోసి దారుణ హత్య చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజు పాలెంకు చెందిన నర్రా హనుమంతరావు భార్య శశికళ (40), కుమారుడు అనీష్‌  సాయి ( 7)గా గుర్తించారు. హనుంతరావు, శశికళకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. 2004 నవంబర్‌లో కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన సుంకర వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి కుమార్తె శశికళతో విజయవాడలో వివాహమైంది. 9 ఏళ్లుగా వారు అమెరికాలో తొమ్మిదేళ్లుగా నివసిస్తున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేస్తుండగా, శశికళ  కాగ్నిజెంట్‌ కంపెనీకి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం శశికళ బాబును స్కూలు నుంచి తీసుకొచ్చారు. సాయంత్రం 7గంటలకు హను మంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సరికి భార్య, కుమారుడు విగత జీవులుగా పడి ఉన్నారు. వారిని గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించిన ఆయన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. 


 మా అల్లుడే నేరస్తుడు :  మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ


 


  అమెరికాలో దారుణ హత్యకు గురైన తల్లి, తనయుడి ఉదంతం పలు అనుమా నాలకు తావిస్తోంది. తమ కుమార్తె, మనవడిని అల్లుడే హత్య చేసి కట్టు కథలు అల్లుతున్నారని శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విజయవాడ నగర శివారులోని తాడిగడప లక్ష్మీపురం లో నివాసం ఉంటున్న శశికళ తల్లి దండ్రులు.. హత్య సమాచారం తెలిసిన వెంటనే కుప్పకూలిపోయారు. ‘బంగారపు తునకను దుర్మార్గుడి చేతిలో పెట్టాం’ అంటూ కన్నీటి పర్వంత మయ్యారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ అల్లుడే ఈ హత్య చేశారని, రెండేళ్ల నుంచి అతని ప్రవర్తన సరిగా లేదని శశికళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని, తనను సరిగా చూడడం లేదంటూ తమ కుమార్తె పలు మార్లు తమ వద్ద  విలపించిం దని అన్నారు. అల్లుడి కుటుంబ సభ్యులకూ ఈ విషయం తెలిసినా కుటుంబాన్ని చక్కదిద్దేందుకు ఎంత మాత్రం ప్రయత్నించలేదని విలపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com